calender_icon.png 18 October, 2024 | 2:41 PM

పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలి

18-10-2024 12:31:27 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు పిలుపునిచ్చారు. శుక్రవారం సంఘ భవనంలో నాయకులతో కలిసి చలో ఎల్బీనగర్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ  పద్మశాలి సంఘం సంయుక్తంగా హైదరాబాదులోని ఎల్బీనగర్ హరిణి వనస్థలి జింకల పార్క్ లో ఈనెల 20న నిర్వహించనున్న పద్మశాలీయుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లాలోని పద్మశాలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పద్మశాలీల ఐక్యతను చాటేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గడదాసు మల్లయ్య, నాయకులు లింగయ్య, ధర్మయ్య, శ్రీకాంత్, రమేష్, తిరుపతి, లక్ష్మీనారాయణ, చందు, వెంకన్న, సంజీవ్, మంగ, విజయ, పుష్ప, జయ, సునీత తదితరులు పాల్గొన్నారు.