అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో ‘రాచరికం’ అనే మూవీ రాబోతోంది. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సారథి స్టూడియోస్లో శరవేగంగా సాగుతున్నాయి.
హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ పాత్ర మాస్ ఆడియన్స్ మెచ్చేలా ఉంటుందని తెలిపిన నిర్మాతలు త్వరలో ‘రాచరికం’ విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. వెంగి సంగీతం అందించిన ఈ సినిమాకి ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్గా పనిచేశారు.