calender_icon.png 7 October, 2024 | 1:56 PM

తండ్రిని చంపిన తనయుడు

06-10-2024 12:00:00 AM

డబ్బుల కోసం వేధిస్తున్నాడని దారుణం 

రాజేంద్రనగర్, అక్టోబర్ 5: ఓ కొడుకు తన కన్నతండ్రిని కడతేర్చాడు. మద్యం తాగడానికి డబ్బుల కోసం వేధిస్తున్నాడని గొడ్డ లితో దాడి చేసిన చంపిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊటుపల్లిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. ఊటుపల్లి గ్రామానికి చెందిన ఆకుల పోచమ్మ, రాములు (52) దంపతులు.

వీరికి నలుగురు కుమార్తెలు, కొడుకు శివకుమార్ ఉన్నాడు. రాములు కొంతకాలంపాటు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి చాలారోజులుగా ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు మద్యానికి అలవాటు పడ్డాడు. రోజూ ఇంట్లో మ ద్యం కోసం డబ్బులు తీసుకునేవాడు. ఈ క్రమంలో గొడవలు కూడా జరిగేవి. శివకుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం రాములు ఇంట్లో డబ్బు లు అడగగా కుటుంబీకులు నిరాకరించారు. అనంతరం శివకుమార్ ఆటో తీసుకొని వెళ్లిపోయాడు. మధ్యాహ్నం సమయం లో రాళ్లగూడ సమీపంలో శివకుమార్ ఆటోలో వెళ్తుండగా ఆపమని తండ్రి అడిగాడు. శివకుమార్ ఆపకుండా అలాగే వెళ్లి పోయాడు.

ఇంటికి వచ్చిన రాములు సా యంత్రం సమయంలో గొడ్డలి తీసుకొని ఊటుపల్లి గ్రామం లోనే శివకుమార్ తన అత్తగారింట్లో ఉన్నాడని తెలుసుకొని ఆవేశంతో గొడ్డలి తీసుకొని వెళ్లాడు. శివకుమార్ పై దాడికి యత్నించగా అతడు గొడ్డలి తీసుకొని తండ్రి కాళ్లపై తిరిగి దాడి చేశాడు. కుప్పకూలిపోయిన రాములు వీపు, ఇతర భాగాలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

అనంతరం సాయం త్రం శివకుమార్ కుటుంబీకుల సాయంతో తండ్రిని ఇంటికి తీసుకెళ్లగా రాత్రి సుమారు 7 గంటల సమయంలో మృతిచెందాడు. సమాచారం అం దుకున్న ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.