calender_icon.png 23 October, 2024 | 5:01 PM

తండ్రిని చంపిన తనయుడు

29-07-2024 12:51:40 AM

రాజేంద్రనగర్, జూలై 28: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు తండ్రిని చంపిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ నరేందర్ కథనం ప్రకారం.. ప్రగతి కాలనీకి చెందిన కిష్టప్ప, మహేందర్ తండ్రీ కొడుకులు. కిష్టప్ప స్థానికంగా చిత్తుకా గితాలు సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మహేందర్ ఏ పని చేయకుండా ఖాళీగా తిరిగేవాడు. కొంతకాలంగా కిష్టప్ప కుటుం బాన్ని పట్టించుకోవడం లేదని కొడుకు గొడవపడుతున్నాడు. అదేవిధంగా వారికి ఉన్న పొలాన్ని విక్రయించి తనకు డబ్బులు ఇవ్వాలని మహేందర్ తండ్రిని వేధి స్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం అర్ధ రాత్రి తర్వాత తండ్రి కిష్టప్పను తోసే యడంతో కిందపడి గాయాలపాలై మృతి చెందాడు. ఆదివారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.