calender_icon.png 14 October, 2024 | 2:40 AM

మద్యానికి డబ్బులివ్వలేదని తండ్రిని చంపిన తనయుడు

14-10-2024 12:16:46 AM

అశ్వారావుపేట, అక్టోబర్ 13: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తం డ్రిని కొడుకు హతమార్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని వడ్లగూడెంలో ఆదివారం జరిగింది. వడ్లగూడెం గ్రామానికి చెందిన కంభంపాటి సత్యనారాయణ మద్యానికి బానిసై తరుచూ తండ్రి కృష్ణయ్య(75)ను వేధించేవాడు. ఆదివారం మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలని అడగడంతో కృష్ణయ్య నిరాకరించాడు. దీంతో సత్యనారాయణ కత్తితో తండ్రి గొంతు కోసి చంపేశాడు.  మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై సాయికిషోర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.