20-04-2025 08:45:17 PM
చెన్నూరు ఇన్చార్జి డా రాజా రమేష్...
చెన్నూర్: ఈనెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరుగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని చెన్నూరు నియోజకవర్గం బిఆర్ఎస్ ఇన్చార్జి డా రాజా రమేష్ కోరారు. మండలంలోని అందుగులపేటలో సందర్భంగా ఆదివారం చలో వరంగల్ కరపత్రాలను విడుదల చేసి గోడ ప్రతులను అంటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు,ఆనేక హామీలతో అధికారం చేపట్టి 18 నెలలు గడిచినప్పటికి గ్యారంటీలు, హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరిట ప్రచారం చేసుకుంటున్నప్పటికి ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నివసిస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు ఈ మహాసభల్లో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాల కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ప్రతి గులాబీ కార్యకర్త ఈనెల 27న వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బడికల సంపత్, మాజీ వైస్ ఎంపీపీ లౌడం రాజ్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు మేకల పుష్పలత, నాయకులు జె. గౌతమ్, చిప్పకుర్తి అఖిల్, శ్రీనివాస్, మహేష్, ప్రవీణ్, సాయి, సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.