calender_icon.png 17 October, 2024 | 12:25 AM

మరో చిత్రం షూటింగ్ పూర్తి

08-10-2024 12:00:00 AM

కోలీవుడ్ హీరో సూర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సూర్య హీరోగా దర్శకుడు శివ భారీ స్థాయిలో తెరకెక్కించిన చిత్రం ‘కంగువ’ విడుదల కోసం ఇప్పటికే ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘కంగువ’ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉండగా, సూర్య తాజాగా మరో సినిమాను ముగించారు. ఆయన కథానాయకుడిగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. సూర్యకు ఇది 44వ సినిమా.

ఇంకా టైటిల్ ఖరారు కానందున సూర్య44 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ; సంగీతం: సంతోష్ నారాయణన్; ఎడిటర్: మహమ్మద్ షఫీక్ అలీ.