calender_icon.png 14 October, 2024 | 4:47 AM

బాసరలో ముగిసిన శరన్నవరాత్రులు

14-10-2024 02:29:00 AM

నిర్మల్,అక్టోబర్13.(విజయక్రాంతి: నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులు 9 రోజుల పాటు ఘనంగా జరి గాయి. చివరి రోజు సరస్వతీ దేవిగా   దర్శనం ఇవ్వడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శని, ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలి వ చ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఆదివారం అమ్మవారిని సినీ నిర్మాత దిల్ రాజు దంప తులు, సిని రచయిత, నటుడు తనికెళ్ల భరణి తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకొన్నారు. తమ కుటుంబంలోని చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చాయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.