29-03-2025 02:37:02 AM
ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ, మార్చి 28: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్స్ పేదల కొరకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని డి ఎం హెచ్ ఓ కోటాచలంతో కలిసి ఆమె సందర్శించి మాట్లాడారు.
300 మంది వరకు క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నట్లు డిఎంహెచ్వో కోటా చలం తెలిపారు. పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, డిసిహెచ్ఎస్ వెంకటేశ్వర్లు,హాస్పిటల్ సూపర్డెంట్ దశరథ, డిప్యూటీ డిఎంహెచ్వో జయ మనోరి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ ఆదిత్య పాల్గొన్నారు