విద్యార్థులకు గాయాలు
నల్లగొండ, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ప్రైవేట్ స్కూల్ బస్సు అదు పుతప్పి గోడను ఢీకొట్టడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యా యి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామ శివారులో మంగళవారం ఈ ఘట న జరిగింది. చిల్లేపల్లికి చెందిన సిటీ సెంట్రల్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఉదయం పాఠశాల బస్సులో అవంతీపురం వేంకటేశ్వరస్వామి దేవాలయానికి తీసుకెళ్లారు.
తిరుగు ప్రయాణంలో గుట్ట పైనుం చి కిందకు దిగుతుండగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయా డు. దీంతో అదుపుతప్పి రోడ్డు పక్క కు దూసుకెళ్లి లింగంపల్లి రవికి చెం దిన ఇంటిగోడను ఢీకొట్టడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని మిర్యాలగూడ ఏరి యా దవాఖానకు తరలించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విద్యార్థులను పరామర్శించారు. ఓ విద్యా ర్థి తండ్రి ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్టు మిర్యాలగూడ రూరల్ ఎస్సై లోకేశ్ తెలిపారు.