calender_icon.png 23 October, 2024 | 11:29 PM

సాయుధ పోరాట వీరుల త్యాగం మరువం

17-09-2024 04:50:51 AM

నిర్మల్, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): తెలంగాణ ప్రజల విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన వీరుల త్యాగం మరువబోమని సీపీఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. సాయుధ పోరాట స్మారక వారోత్సవాల్లో భాగంగా సోమవారం వెయ్యి ఉరుల మర్రి వద్ద ఉన్న రాంజీగోండు స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌ఎన్‌రెడ్డి, ఉపాలి, సాయి, కుండలి, అనంతదుర్గే నసీర్, బలరాం, తదితరులు పాల్గొన్నారు.