calender_icon.png 23 October, 2024 | 3:06 AM

పారిపోయిన విద్యార్థులు దొరికారు

23-10-2024 12:46:44 AM

భైంసా, అక్టోబర్ 22: దసరా సెల వుల అనంతరం వసతి గృహానికి తిరి గి వచ్చిన  నలుగురు విద్యార్థులు ఎవరికీ చెప్పకుండా పారిపోయిన ఘటన బైం సాలో  సంచలనం రేకెత్తింది. ఎట్టకేలకు వారు పోలీసులకు దొరి కారు. భైంసా సుభాష్‌నగర్ కాలనీలోని ఎస్సీ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులు దసరా సెలవుల అనంతరం వసతి గృహానికి తిరిగి వచ్చారు.

వానల్‌పాడ్, కుభీరు మండలం రంజ నికి చెందిన మరో ముగ్గురు విద్యార్థులు మంగళ వారం ఉదయం ఎవరికీ చెప్ప కుండా వసతి గృహం నుంచి పారిపో యారు. వసతి గృహ సిబ్బంది, ఇన్‌చార్జి వార్డెన్ నగేశ్ పట్టణ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థులను కుభీరు మండలంలోని పల్సి వద్ద గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.