విద్యార్థులకు స్వల్ప గాయాలు
కామారెడ్డి/నిజామాబాద్, అక్టోబర్25(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద శుక్రవారం ఉదయం ఓ ప్రవేట్ పాఠశాలకు చెందిన బస్సు యూ టర్న్ తీసుకుంటుండగా కామారెడ్డి నుంచి నిజామాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సులో ఉన్న కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామా బాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులు స్పీడ్గా లేకపోవడం వలన పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు డిచ్పల్లి పోలీసులు ఆర్టీసీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు.