15-04-2025 12:00:00 AM
కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధర్రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): భారతరత్న డా.బీఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశంలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే మురళీ ధర్రెడ్డి అన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నివాళులర్పించి, మాట్లాడారు. -బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు మనందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు ఎంతో కీలకమని, ముఖ్యంగా బహుజన వర్గాలకు రిజర్వేషన్లు జీవితాల్లో మెరుగైన మార్పును తీసుకొ స్తాయన్నారు. ఈ దిశగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో 42శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయించడం ప్రశంసనీయమని మురళీధర్రెడ్డి తెలిపారు.