calender_icon.png 23 September, 2024 | 8:56 AM

ఇంగ్లాండు రాణి సందడి

22-09-2024 12:00:00 AM

శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు ఇందులో వివిధ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్‌గా ‘ఇంగ్లాండు రాణి’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్  స్వరాలు సమకూర్చిన ఈ పాటలో అనుభూతిగా రీతూవర్మ క్యారెక్టర్‌ను చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. స్వరూప్ గోలి లిరిక్స్ ఆకట్టుకున్నాయి. కైలాస్ ఖేర్ పాడిన తీరు కట్టిపడేసింది. ఈ సినిమాకు వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్, నందు మాస్టర్ స్టంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.