calender_icon.png 16 October, 2024 | 7:47 PM

అవకాశం కల్పిస్తే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా...

16-10-2024 05:30:06 PM

బీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆశిస్తున్నా

డాక్టర్ బి.ఎన్.రావు..

హుజురాబాద్, (విజయక్రాంతి): రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించి గెలిపిస్తే నాలుగు నియోజకవర్గాల్లోని నిరుద్యోగులతో పాటు ఉద్యోగుల సమస్యల సాధనకు కృషి చేస్తానని డాక్టర్ బి.ఎన్.రావు అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని సాయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు వారాల జల్లులు కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత వాటిని విస్మరిచ్చిందన్నారు. తనకు అవకాశం కల్పించి గెలిపిస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పడే సమస్యలపై పోరాడుతానన్నారు. తనకు సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు బీఆర్ఎస్ టికెట్ కూడా తనకే కేటాయిస్తారని ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వైద్యులు డాక్టర్ రామలింగారెడ్డి, తొగరు విద్యాసాగర్, రిటైర్ ఉద్యోగుల సంఘం నాయకులు సందుపట్ల జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.