17-04-2025 07:49:37 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మార్పీఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్, మచ్చ రాజేష్ తో పాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.