28-02-2025 05:49:44 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. ఇచ్చోడ మండలం సిరిచెల్మలో శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 11న నిర్వహించే సంఘం జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.