calender_icon.png 25 September, 2024 | 12:03 PM

తిరుపతి వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

25-09-2024 02:45:04 AM

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి వెళ్తున్న ఓ విమానాన్ని మంగళవారం పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఎయిర్‌పోర్టు వర్గాల కథనం ప్రకారం.. ఎయిర్‌ఇండియా విమానం మంగళవారం శంషాబాద్ నుంచి ప్రయాణికులతో తిరుపతి బయల్దేరింది. ఏపీలోని ఒంటిమిట్ట సమీపంలో ఫ్లుటైలో సాంకేతిక లోపం తలెత్తింది.

దీనిని గుర్తించిన పైలెట్లు తిరిగి విమానాన్ని క్షేమంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. టెక్నీషియన్లు, సిబ్బంది విమానంలో టెక్నికల్ సమస్యలను గుర్తించి మరమ్మతులు చేసిన అనంతరం ఫ్లుటై తిరిగి తిరుపతి బయలుదేరి వెళ్లింది.