హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత గొప్ప పోరాట చరిత్రను నేటి తరానికి తెలియకుండా గత పాలకులు తొక్కిపెట్టారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. ఇందుకు ఓటుబ్యాంకు రాజకీయాలు, సం తుష్టీకరణ కారణమని మండిపడ్డారు. ‘సెప్టెంబర్ 17’ను పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమోచన దినంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వక్రభాష్యాలు చెప్పి మోసం చేశాయని మండిపడ్డారు.