calender_icon.png 25 September, 2024 | 2:03 PM

స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి

25-09-2024 02:18:57 AM

త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ : పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 24        (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు నేతృత్వంలో ఆ జిలా కు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం గాంధీభవ న్‌లో పీసీసీ చీఫ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట అని, నాయకులు, కార్యకర్తలందరూ కలిసి పని చేస్తే మరో పార్టీకి చోటే ఉండదని చెప్పారు. చిన్న వయసులోనే ఉద్యమాల బాట పట్టి ఉద్యమకారుడిగా పేరుగాంచిన బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందడం అభినందనీయమని పేర్కొన్నారు.

త్వరలోనే రాష్ట్ర, జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని, ఆ పోస్టుల్లో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా చోటు లభిస్తుందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత పార్టీ పెద్దగా తనపై ఉందని వెల్లడించారు.