calender_icon.png 5 October, 2024 | 2:50 PM

ప్రభుత్వంపై ప్రతిపక్షాల వైఖరి మారాలి

05-10-2024 01:56:48 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కరీంనగర్‌లో మేధా హోమం

కరీంనగర్, అక్టోబరు 4 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన అందిస్తుంటే, కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, నాళాలు, ప్రభుత్వ భూములను సంరక్షిస్తుంటే చూడలేని బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల వ్యతిరేక వైఖరి మారాలని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు.

శుక్రవారం నగరంలోని ఇందిరాచౌక్‌లో ప్రభుత్వ విధానాలపై బీజేపీ, బీఆర్‌ఎస్ వైఖరి మారాలని కాంక్షిస్తూ వేద మంత్రాలతో మేధా హోమం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కొరివి అరుణ్‌కుమార్, శ్రవణ్‌నాయక్, ఎండి తాజ్, కార్పొరేటర్లు అర్ష కిరణ్మయి, మల్లే శం, మెండి కళ్యాణి చంద్రశేఖర్, గంట కళ్యా ణి శ్రీనివాస్, కాశెట్టి లావణ్య శ్రీనివాస్, ఆకు ల నర్మద నర్సయ్య,  తదితరులు పాల్గొన్నారు.