calender_icon.png 23 February, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచాలి

14-02-2025 12:47:12 AM

తాడ్వాయి, ఫిబ్రవరి, 13( విజయ క్రాంతి): గ్రామాలలో కూలీల సంఖ్యను పెంచాలని తాడువాయి ఇన్చార్జి ఏపిఓ కృష్ణ గౌడ్ తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన గురువారం క్షేత్ర సహాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కచ్చితంగా 50 నుంచి 100 మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో హాజరయ్యేలా చూడాలని కోరారు గ్రామాల్లో వనమోత్సవం లో భాగంగా   నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ఫీల్ అసిస్టెంట్లు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు స్వామి మహిపాల్ రెడ్డి ఫీల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు