calender_icon.png 11 October, 2024 | 11:02 PM

ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

04-09-2024 12:07:16 AM

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి 

నల్లగొండ(విజయక్రాంతి)/మునుగోడు, సెప్టెబంర్ 3: ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీలోని ప్రభుత్వ దవాఖానను మంగళవారం కలెక్టర్ నారాయణరెడ్డి తో కలిసి పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న దవాఖాన భవనం స్థానంలో కొత్తది నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జడ్పీ ఉన్నత బాలిక పాఠశాలలను పరిశీలించారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. అనంతరం మున్సిపాలిటీలో సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి  పనులపై ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.