calender_icon.png 12 October, 2024 | 6:49 PM

తర్వాతి తరంలో స్ఫూర్తి నింపాలి

10-10-2024 12:00:00 AM

హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి కాంబోలో వచ్చిన చిత్రం ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో పోషించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శిత మవుతోంది.

తమ సినిమా కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిందని పేర్కొంటూ మేకర్స్ విజయోత్సవం నిర్వహించారు. హైదరాబాద్‌లో మంగళ వారం రాత్రి ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ పేరుతో ఈ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘ఇలాంటి రిస్కులు, కొత్త కథలు ప్రయత్నించకపోతే తర్వాతి తరంలో మనం స్ఫూర్తి నింపలేం’ అని తెలిపారు.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘శ్వాగ్ సినిమా కంటెంట్ విషయంలో చాలా గర్వపడుతున్నా’ అన్నారు. ‘ఈ సినిమాని రాస్తున్నప్పట్నుంచి బోల్డ్ కంటెంట్ అని ఎప్పుడూ అనుకోలేదు. ప్రేక్షకులు బోల్డ్ కంటెంట్ అని చెప్పడం చాలా కిక్‌నిచ్చింది’ అని డైరెక్టర్ హసిత్ గోలి చెప్పారు. హీరోయిన్ దక్ష నాగర్కర్, ఎడిటర్ విప్లవ్, మూవీ టీమ్ అంతా ఈ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు.