calender_icon.png 4 October, 2024 | 6:49 PM

రైతుల ప్రయోజనమే లక్ష్యంగా నూతన పాలకవర్గం కృషి చేయాలి

04-10-2024 04:12:15 PM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

కామారెడ్డి (విజయక్రాంతి): రైతుల ప్రయోజనమే లక్ష్యంగా ప్రారంభం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం పనిచేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మర్కల్ గ్రామ సమీపంలోని అశోక్ గార్డెన్లో సదాస్ నగర్ మండల మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జయరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ శంకర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ముఖ్య అతిథులు హాజరై మాట్లాడారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్గా సంగీయ నాయక్ వైస్ చైర్మన్గా రాజిరెడ్డి నూతన పాలక డైరెక్టర్ లా చేత జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య ప్రమాణ స్వీకారం చేయించారు. రైతులు మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రతినిధులపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని వారి ఆశలను వమ్ము చేయకుండా పనులు చేసి చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావును ఎంపీ సురేష్ షెట్కార్ ను  నూతన పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు.