23-03-2025 12:32:48 AM
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): రాష్ర్టంలో పట్టభద్రులు, ఉపాధ్యా య నియోజకవర్గాల ఎన్నికల కోడ్ కారణంగా ఫీల్డ్ విజిట్స్ చేయలేకపోయామని, ఈనెల చివరిలోపు ఫీల్డ్ విజిట్స్ పూర్తిచేసి కొన్ని కులాల పేర్ల మార్పిడి విషయంలో తుదినిర్ణయం తీసుకుంటామని తెలంగాణ బీసీ కమిషన్ తెలిపింది.
ఖైరతాబాద్లోని కమిషన్ ఆఫీసులో చైర్మన్ జీ నిరంజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యు లు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, కమిషన్ మెం బర్ సెక్రటరీ బాల మాయాదేవి పాల్గొన్నా రు. రాష్ర్టంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుం చి, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల కులాల వివరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. స్కూల్, ఇంటర్మీడియ ట్, హైయర్ ఎడ్యుకేషన్ నుంచి కులాల వారీగా విద్యార్థుల వివరాలు సేకరిస్తామంది.