నిర్మల్ (విజయక్రాంతి): సోను మండలంలోని మాదాపూర్ గ్రామంలో బుధవారం స్కూల్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ తరగతులను మండల విద్యాశాఖ అధికారి పరమేశ్వర్ ప్రారంభించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధన అంశాలపై పట్టు సాధించేందుకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.