calender_icon.png 12 October, 2024 | 10:56 AM

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు

03-09-2024 11:57:44 PM

  1. ముఖంపై దిండుతో అదిమి హత్య 
  2. హత్యకు దారి తీసిన అనుమానం

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 3(విజయక్రాంతి): భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం సంగం గ్రామానికి చెందిన కాయిత రాముతో మంచిర్యాల జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన రాధతో ఐదు సంవత్సరల క్రితం వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు పిల్లలున్నారు. రాము ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై రాముకు అనుమానం పెరిగింది. దీంతో ఆమెను అంతమొంది ంచాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి భార్య, పిల్లలతో కలిసి రాము నిద్రకు ఉపక్రమించాడు. భార్య, పిల్లలు గాఢ నిద్రలో జారుకున్న తర్వాత రాము లేచి దిండుతో రాధ ముఖంపై గట్టిగా అదిమిపట్టడంతో ఊపిరాడక మృతి చెందింది.  

ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లారేసరికి విగత జీవిగా ఉన్న తల్లిని చూసి పిల్లలు బోరున విలపించడంతో విషయం వెలుగు చూసిం ది. రాధ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పాల్వంచ రూరల్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.