11-02-2025 08:50:07 PM
గోదావరిఖని సీఐ ఇంద్రసేనారెడ్డి..
గోదావరిఖని (విజయక్రాంతి): కన్న కొడుకు, భార్యపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని 1-టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ... పట్టణంలోని గంగానగర్ లో నివాసం ఉంటున్న మడిపల్లి ఉదయ్ (30) సింగరేణి ఉద్యోగి 2022 సంవత్సరంలో అనూష అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరిరు 8 నెలలు ఎంతో సాఫీగా జీవితాన్ని కొనసాగించిన తర్వాత మనసు పరదలొచ్చి అనూష వాళ్ళ తల్లిదండ్రుల వద్ద ఉంటున్న జీఎం కాలనీకి వెళ్ళింది. వీరికి ఒక బాబు 18 నెలలు.
ఆ తరువాత ఉదయ్ వేధింపులు భరించలేక అనూష గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, 498 కేసు నామోదు కావడంతో, భార్యాభర్తల మధ్య కేసు నడుస్తున్న క్రమంలో సాయంత్రం ఉదయ్ తన బైక్ వచ్చి జిఎం కాలనీలోని తన భార్య తల్లిగారిల్లు ఇంటికి వెళ్లి తన భార్యపైన 18 నెలల తన కొడుకు పైన బైకుతో గుద్ది హత్యాయత్నం ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు అడ్డుకోవడంతో తప్పించుకొని అతను పారిపోయాడు. అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ తెలిపారు. అతడి దగ్గర నుంచి ఒక కారు బైకును సీజ్ చేశామన్నారు. సీఐ వెంట ఎస్సై సిబ్బంది ఉన్నారు.