calender_icon.png 23 October, 2024 | 3:05 AM

మూడు నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ముగించాలి

04-08-2024 03:15:36 AM

  1. ప్రభుత్వ భూములను సంరక్షించాలి
  2. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 3 (విజయక్రాంతి) : ప్రభుత్వ భూముల పరిరక్షణపై దృష్టి సారించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ భూముల సంరక్షణ, ఎల్‌ఆర్‌ఎస్, ధరణి పెండింగ్ దరఖాస్తులపై శనివారం భూపాలపల్లి జిల్లా  కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి శ్రీకారం చుట్టిందని, లేఅవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను మూ డు నెలల్లో పూర్తిచేయాలన్నారు. తమ ప్రభుత్వం మీద ప్రజలు ఎ న్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్యదళారుల ప్రమే యం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్లు నిరం తరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్ చేస్తున్న క్రమంలో ప్రభుత్వ భూములు  ప్రైవేట్  వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అత్యంత జాగ్రత్త గా వ్యవహరించాలని, అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. 

గతంలో పరిష్కారానికి నోచుకోలేదు..

 గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి 2020 అక్టోబర్ 31వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను స్వీకరించిందని, ఆ సమయంలో 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదన్నారు. మొత్తం 25.70 లక్షల దరఖాస్తుల్లో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.69 లక్షలు,  గ్రామపంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చా యని, ఈ సమస్య పరిష్కారం కొరకు నాలుగేళ్ల నుండి లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ దరఖాస్తు లను అత్యంత ప్రాధాన్యతాక్రమం లో పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.  

మల్టీ డిసిప్లినరీ బృందాలను నియమించాలి

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పర్యవేక్షణ కోసం జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని, ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూశాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను నియమించాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు.

క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్‌లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలను సత్వరం ఏర్పాటు చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షి స్తారని తెలిపారు. ఎల్‌అర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిలలోని సిబ్బంది, అధికారులకు  తక్షణమే శిక్షణ ఇవ్వా లన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ విధి విధానాలను విడుదల చేసిన నేపథ్యంలో అమలుకు అవసరమైన కార్యాచరణను చేపట్టాల న్నారు. జిల్లా కలెక్టర్‌లు ఈ ప్రక్రియ ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. 

విలువైన భూములున్నాయి

హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న జిల్లాల్లో అత్యంత విలువైన భూములున్నాయని, ఈ జిల్లాల్లో లేఔట్‌ల క్రమబద్ధీకరణ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ర్టంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రణాళికాబద్ధమైన స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. వారి ఆస్తులకు చట్టపరమైన గుర్తింపుతో సహా ఆమోదించబడిన లేఔట్ల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆమో దించబడిన లేఔట్‌ల వలన ఇంటి నిర్మాణాలకు నిర్మాణ అనుమతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి,  విక్రయించడానికి ఎల్ ఆర్‌ఎస్ ప్రక్రియ దోహదపడుతుందన్నారు.