calender_icon.png 6 February, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సును ఢీకొట్టిన లారీ..

06-02-2025 05:15:14 PM

40 మంది ప్రయాణికులు సురక్షితం..

హుజురాబాద్ (విజయక్రాంతి): బస్సును లారీ ఢీకొనడంతో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జమ్మికుంట రోడ్డులో గురువారం ఆర్టీసీ బస్సును లారీ ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి ఆర్టీసీ  బస్సును వెనుక ఢీ కొట్టింది. దీనితో ఆర్టీసీ  బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ మినీ బస్సు టీఎస్ 23 0002 నంబరు గల బస్సు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీ కొట్టి ఆగింది.

ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా వారు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మినీ బస్సు మాత్రం ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ రవీందర్ పోలీసులను ఆశ్రయించారు. లారీ డ్రైవర్ ఎండి జలీల్ నిర్లక్ష్యం వల్లే ఆర్టీసీ బస్సు వెనకాల తగిలి బస్సు డివైడర్ కు ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్ లారీ యూనియన్ నాయకులను పిలిపించి బస్సు డ్రైవర్ ని బెదిరించేందుకు ప్రయత్నించగా పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.