calender_icon.png 11 October, 2024 | 3:58 AM

కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం

11-10-2024 01:57:24 AM

సంగారెడ్డి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): సంగారెడ్డి ప్రభుత్వ దవాఖా నలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఆచూకీ లభ్యం అయ్యింది. బోరబండలో కిడ్నాపర్ల చెరలో ఉన్న శిశువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమరాల ఆధారంగా ఇద్దరు మహిళలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటప డింది. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు. అయితే ఈ ముఠాలో మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.