calender_icon.png 23 October, 2024 | 7:52 AM

లైన్‌మెన్ మృతి

23-10-2024 01:18:34 AM

హుజూరాబాద్, అక్టోబర్ 22: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో సోమవా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో జూనియర్ లైన్‌మెన్ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన మ్యాదరి సాయి రమణ (30) ఆముదాలపల్లిలో జూనియర్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

సోమవారం రాత్రి 8 గంటల తర్వాత గ్రామంలో బ్రేక్ డౌన్ కావడంతో విధులు నిర్వహించి తిరిగి మల్యాలకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో తుమ్మనపల్లి కాకతీయ కాలు వ సమీపంలో స్పీడ్ బ్రేకర్ల వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో సాయిరమణ అక్కడికక్కడే మృతిచెందాడు.