11-03-2025 12:37:06 AM
లక్షెట్టిపేట, మార్చి 10 (విజయక్రాంతి) : తొమ్మిది నెలల బాలుడు కూల్ డ్రింక్ బాటిల్ మూత మింగి మరణించిన ఘటన లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఆదివారం జరిగింది. ఎస్త్స్ర సతీష్ తెలిపిన వివరాల ప్రకారం గడికోప్పల సురేందర్ కు భార్య, కుమార్తె, కుమారుడు రుద్రాయన్ ఉన్నారు. ఆదివారం సాయంత్రం బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో కొమ్ముగూడెం వెళ్లారు.
అక్కడ బాలుడు కూల్డ్రింక్ బాటిల్ మూత నో ట్లో పెట్టుకుని ఆడాడు. తర్వా త అది గొంతులోకి జారింది. ఊపిరి ఆడకపోవడంతో తల్లి దండ్రులు వెంటనే క్యాప్ తీసి కారులో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి రుద్రాయన్ ను తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.