సిరిసిల్ల,అక్టోబర్ 17: డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఆశ చూపి, తమ భూములను లాక్కొని రోడ్డు మీడ పడేశారని సిరిసిల్ల అంబేద్కర్నగర్కు చెందిన దళితులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని నర్సింగ్ కాలేజీ వద్ద గురువారం బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం తమకు దాదాపు 10 ఎకరాల భూమిని కేటాయించిందని అన్నారు. ఆ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఆశ చూపి లాగేసుకున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన తర్వాత ఐదేళ్లుగా తమకు కేటాయిస్తామని ఆశ చూపుతూ వచ్చారని చెప్పారు. ఇప్పుడు వాటిని దళితులకు కాకుండా ఇతరులకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పటి అధికారుల అండదండలతో మున్సిపల్ పాకలవర్గం ఆ ఇండ్లను అమ్ముకొని, తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి, అధికారులతో రీ సర్వే చేయించాలని.. తమకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించి న్యాయం చేయాలని కోరారు.