12-04-2025 10:20:20 PM
మంచిర్యాల (విజయక్రాంతి): హనుమాన్ జయంతి పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్రను శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ యాత్రలో మంచిర్యాల మాజీ శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహేష్ గౌడ్, విహెచ్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.