calender_icon.png 16 October, 2024 | 4:55 PM

90 దాటినా ప్రయాణం ఆగదు

16-10-2024 03:41:51 AM

తన ఏజ్‌పై ప్లకార్డుల ప్రదర్శనతో స్పందించిన శరద్ పవర్

ముంబాయి, అక్టోబర్ 15: త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో క్యాడ ర్‌ను సమాయత్తం చేసేందుకు నిర్వహించిన సభలో పాల్గొన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌పవర్‌కు చేదు అనుభవం ఎదురైం ది. ఆయన సభలో మాట్లాడుతున్న టైమ్‌లోనే కొందరు యువకులు ‘84 ఏండ్లు’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. వీటిని చూసిన శరద్‌పవ ర్ తనశైలిలో స్పందించారు.

ప్లకార్డులు ప్రదర్శించిన వారిని ఉద్దేశిస్తూ ‘మీరేమీ బాధపడకండి.. మనది సుదీర్ఘ ప్రయాణం.. మహారాష్ట్రను సరైన మార్గంలో నడిపేవరకు ఈ వృద్ధుడు ఆగిపోడు. 84 ఏండ్లు కాదు.. 90 ఏండ్లు దాటినా రాష్ట్రం కోసం శ్రమిస్తూనే ఉంటా. అప్పటివరకు విశ్రమించను’ అని అన్నారు.