16-04-2025 01:42:22 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాసం పథకాలను అర్హులకు అందించాలని మహబూబాబాద్ జిల్లా సిపిఐ నాయకుడు అజయ్ సారధి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిపిఐ, ఏఐటీయూసీ సంయుక్త సమావేశం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అలా కాకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మే డే వేడుకను ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఒక్క కార్మికుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి మేడే వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ నాయకులు వెలుగు శ్రావణ్, పెరుగు కుమార్, రేషనపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, శ్రావణ్, అశోక్, ఎండి మహమూద్ , చిరంజీవి, ప్రవీణ్, చిదురాల జ్ఞానేశ్వర్, యాకమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.