19-03-2025 12:43:57 AM
ఇండ్లల్లో చొరబడి నగదు అపహరణ
సీసీ ఫుటేజీల్లో రికార్డ్ అయిన దృశ్యాలు
చేవెళ్ల , మార్చి 18 : చేవెళ్ల మండల పరిధి సింగప్పగూడ, న్యాలట గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలకు సంబంధించి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సింగప్పగూడ గ్రామానికి చెందిన అంజిరెడ్డి (44) ఇంట్లో నిద్రిస్తున్న సమయం అర్ధరాత్రి 1 గంటకు బయట నుంచి గొల్ల పెట్టారని తన కుమారుడు మొలుగు అంజిరెడ్డికి ఫోన్ చేసి తెలుపగా అతను వచ్చి తలుపులు తీసి.. పక్కన ఉన్న రూమ్కి వెళ్లి చూడగా అల్మారా పగులగొట్టి అందులో ఉన్న రూ.8 వేలు అపహరించారు.
అదేవిధంగా న్యాలట గ్రామాని కి చెందిన ఒగ్గు నాగయ్య (65) తన భార్యతో కలిసి తన అత్తగారింటి వెళ్లారు. పొరుగు ఇంటి వారు మంగళవారం ఉదయం నాగయ్యకు ఫోన్ చేసి మీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి.. తాళం విరగ్గొట్టి ఉన్నదని సమాచారం ఇచ్చారు. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని రూ.10 వేల నగదు కనిపించలేదు. న్యాలట గ్రామంలోని కొందరి ఇండ్లల్లో కూడా దొగలు చొర బడ్డారని గ్రామస్తులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ముఖాలకు ముసుగు..కత్తులు, రాడ్లతో సంచారం..
దుండగులు ముఖాలకు ముసుగు వేసుకొని.. కత్తులు, రాడ్లు పట్టుకొని సంచారం చేశారు. రెండిండ్లలో చోరీ చేసిన వాళ్లు మూడో ఇంట్లో దొంగతనం చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ సీసీ కెమెరాలు ఉం డడంతో వెనుదిరిగారు. ముగ్గురు వ్యక్తులు ఇంటి వద్దకు వస్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. రామన్నగూడ గ్రామంలోనూ బైక్ను ఎత్తుకెళ్లారు. దొంగలు దర్జాగా సంచరిస్తుండడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. పోలీసుల పహార, గస్తీ పెంచా ల్సిన అవసరముందని అంటున్నారు.