calender_icon.png 28 October, 2024 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్తను కట్టేసి.. భార్య గొంతు కోసి

30-08-2024 01:31:26 AM

  1. లక్ష నగదు , 5 తులాల బంగారం, బైక్ చోరీ 
  2. బస్వాపూర్‌లో దొంగల బీభత్సం

హనుమకొండ, ఆగస్టు 29(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. కాటారం మండలం బ స్వాపూర్‌లోని ఓ ఇంట్లో చొరబడిన దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. బుధవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఉన్న దంపతులపై దాడి చేసి భర్తను తాళ్లతో కట్టేసి భార్య గొంతు కోసి లక్ష నగదు, 5 తులాల బంగా రం, బైక్‌ను ఎత్తుకెళ్లారు. జిల్లాలో సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... బ స్వాపూర్‌లో పడాల తిరుపతి, స్వర్ణలత దం పతులు ఇంట్లో కిరాణం షాపు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి షాపు మూసేసిన తర్వాత తిరుపతి రోజు మాదిరిగానే ఇంటి ఎ దుట నిద్రిస్తుండగా భార్య స్వర్ణలత ఇంట్లో పడుకుంది. అర్ధరాత్రి 2 గంటల తర్వాత స్వ ర్ణలత ఇంటి వెనకాల వైపు ఉన్న వాష్‌రూంకు వెళ్లింది.

అప్పటికే బయట వేచి ఉన్న ఇద్ద రు దుండగులు ఆమెను కత్తితో బెదిరించి ఇంటి లోపలికి చొరబడ్డారు. స్వర్ణలత గట్టిగా అరవడంతో ఆమె గొంతును కత్తితో కోసి గాయపరిచారు. భార్య అరుపులు విన్న తిరుపతి నిద్ర నుంచి మేలుకుని ఇంటిలోకి వెళ్లాడు. దుండగులు తిరుపతిని సై తం బెదిరించి తాళ్లతో బంధి ంచారు. ఇంట్లో ఉన్న లక్ష నగదు, 5 తులాల బంగారం, బైక్‌ను తీ సుకుని కాటారం వైవునకు పారిపోయారు.

అనంతరం బాధితులు కట్లు విప్పుకొని  డయల్ 100 కు ఫోన్ చేశారు. భూపాలపల్లి ఓఎస్డీ బోనాల కిషన్, కాటారం డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్ టీం, డాగ్‌స్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దుండగులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.  పాత నేరస్థుల వివరాలతో విచారణ చేస్తామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.