calender_icon.png 14 October, 2024 | 8:08 AM

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

14-10-2024 01:06:00 AM

కుటుంబ కలహాలే కారణం!

సరూర్‌నగర్‌లో దారుణం

ఎల్బీనగర్, అక్టోబర్ 13: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను అతికిరాతంగా హత్యచేసిన ఉదంతం సరూ ర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలు గు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు... ఏపీలోని ప్రకాశం జిల్లాకి చెం దిన గుంజి వెంకటేశ్(37), సోనీ(32) భార్యాభర్తలు. జీవనోపాధి నిమిత్తం రెండ్లేళ్ల క్రితం వారిద్దరు హైదరాబాద్ వలసవచ్చి సరూర్‌నగర్‌లోని సరస్వతీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నా రు.

వీరికి ఇద్దరు పిల్లలు. వెంకటేశ్ మేస్త్రీ పని చేస్తుండగా, సోనీ స్థానికం గా పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తోం ది. కాగా గతకొంతకాలంగా భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నా యి. పెద్దలు పలుమార్లు పంచాయితీ లు పెట్టి ఇద్దరిని కలిపినప్పటికీ వారి మధ్య గ్యాప్ రోజురోజుకు పెరుగుతూ వచ్చింది.

ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం పిల్లలు ఆడుకోవడానికి ఇంటిపైకి వెళ్లగా.. ఓ డ్రెస్ విషయమై సోనీతో వెంకటేశ్ గొడవపడ్డాడు. ఇద్ద రి మధ్య మాటామాటా పెరగడంతో వెంకటేశ్ ఆవేశంతో సోనీని కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తనను తాను గాయపర్చుకున్నాడు.

స్థానికులు ఇచ్చిన సమాచా రంతో సరూర్‌నగర్ పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వెంకటేశ్‌ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.