నిర్మల్, అక్టోబర్23(విజయక్రాంతి): భార్యపై భర్త కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన ప్రకారం నిర్మల్ పట్టణంలోని చింతకుంటవాడకు చెంది న గోవింద్, నవనీతలు భార్యాభర్తలు. భర్త పనికి పోకుండా మద్యం తాగి భార్యను వేధిస్తున్నాడు. దీంతో మంగళవారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అదేరాత్రి కోపంతో నవనీత ఇంటినుండి బయటకు వెళ్లింది. భర,్త కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె కనిపించ లేదు.
ఆమెను హతమార్చాల ని భర్త నిర్ణయించుకొని ఆమె పనిచేసే ఆసుపత్రి వద్ద బుధవారం కాపు కాశా డు. నవనీత ఆసుపత్రికి వస్తుండగా ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించి ఒక్కసారిగా తన వెంట తెచ్చుకొన్న కత్తి తో ఆమెపై దాడి చేశాడు.
అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. చికిత్స కోసం నవనీతను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంద ని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.