15-03-2025 12:00:00 AM
వికారాబాద్, మార్చ్-14: తెలంగాణ ఉద్యమ నేత ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఉద్యమకారులకు దక్కిన గౌరవమని తెలంగాణ ఉద్యమకారుడు జొన్నల రవిశంకర్ అన్నారు. దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ఆయనను జొన్నల రవి శంకర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రవహిస్తున్న నదీ ప్రవాహం అని ఆఆ ప్రవాహానికి ఎదురోడ్డి తట్టుకుని నిలిచే నాయకుడు దాసోజు శ్రవణ్ అని గుర్తించి కెసిఆర్ ఎమ్మెల్సీ పదవినిచ్చారని అని గుర్తు చేశారు.