ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): అన్నీ ప్రభుత్వాల హయాంలో అక్రమ నిర్మాణాల తొలగింపు జరిగిందని, ఇది ఏ ఒక్క ప్రభుత్వం చేసిది కాదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో నిబంధనలు పాటించాలని మాత్రమే హైకోర్టు చెప్పిందని ఆయన తెలిపారు.
సోమవారం జీవన్రెడ్డి సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కోసం బీజేపీ దీక్షలు చేయడం ఆశ్చర్యంగా ఉందని, బీజేపీకి, రైతులకు ఏం సంబంధమన్నారు. బీజేపీ అంటేనే పెట్టుబడిదారుల పార్టీ అని ఆయన ఆరోపించారు. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ. 6 వేలు మాత్రమే ఇస్తుందన్నారు.