calender_icon.png 20 October, 2024 | 2:15 PM

పుస్తకాలు చదివే అలవాటు పెరగాలి

20-10-2024 02:25:14 AM

* మంత్రి జూపల్లి కృష్ణారావు 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): నేటి సమాజంలో పుస్తకాలు చదివే అలవాటు మరింత పెరగాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 19 నుంచి 29 వరకు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించబోయే హైదరాబాద్ బుక్‌ఫేర్‌కు ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలందిస్తామని తెలిపారు. పుస్తక ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకులు యాకూబ్, ఆర్ వాసు, నారాయణ రెడ్డి, కే బాల్‌రెడ్డి, శోభన్‌బాబు, కే సురేశ్, ఎం సూరిబాబు పాల్గొన్నారు.