calender_icon.png 20 October, 2024 | 6:57 AM

నానమ్మను హత్య చేసిన మనవడు

20-10-2024 02:33:25 AM

*మద్యం మత్తులో డబ్బుల కోసం ఘాతుకం

మేడ్చల్, అక్టోబర్ 19: మద్యం మత్తులో డబ్బుల కోసం నానమ్మను హత్య చేశాడు ఓ మనవడు. ఈ ఘటన మేడ్చల్  పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రావల్‌కోల్ గ్రామానికి చెందిన బాలమ్మ (66)కు ఉన్న కొంత భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులో కొంత తన మనవరాళ్లకు ఇచ్చింది. అయితే, తాను బైక్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాలని మనవడు ప్రశాంత్ తరచూ వేధించేవాడు

. బాలమ్మ ఈ విషయాన్ని ప్రశాంత్ అక్కలకు చెప్పడంతో శుక్రవారం వారు వచ్చి నచ్చజెప్పి వెళ్లారు. అదే రాత్రి తాగిన మైకంలో బాలమ్మ గదిలోకి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె తలను గోడకు బాదాడు. ఆ సమయంలో ప్రశాంత్ తల్లిదండ్రులు లక్ష్మి, మధు పక్క గదిలో ఉన్నా రు. ప్రశాంత్ వెళ్లి తల్లికి విష యం చెప్పగా వచ్చి చూసేసరికి బాల మ్మ మరణించి ఉంది. కాలనీవాసులు 100 నంబర్‌కు డయల్ చేయ డంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ప్రశాంత్ ఏ పని లేకుండా జులాయిగా తిరుగుతాడని, గంజా యి మత్తులో హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.