04-03-2025 12:20:37 AM
సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య
మంచిర్యాల, మార్చి 3 (విజయక్రాంతి) : రజక వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య ఆన్నారు. నీలకంఠేశ్వర హాస్పిటల్స్ చార్వాక ట్రస్ట్ భవనంలో సోమ వారం జరిగిన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.
జిల్లా అధ్యక్షులు తంగళ్ళపల్లి వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు, జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజుల రామచంద్రం, నడిగోట తిరుపతి, జిల్లా సహాయ కార్యదర్శి పైతారి ఓదేలు, ముషికే చందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగెపు హనుమంతు, జాలిగాపు రాజేశ్వరి, తరిగొప్పుల భాగ్య, తోట కళావతి, కంచర్ల శ్రీనివాస్, పున్నం సమ్మయ్య, పాయిరాల రమేష్, కొండపర్తి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.