సంఘటన స్థలానికి సకాలంలో చేరుకునేందుకు కొత్తగా వాహనాలు ఏర్పాటు
రాష్ట్ర వైద్యాధిక శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు భద్రతతో పాటు సంఘటన జరిగిన స్థలానికి వెంటనే చేరుకున్నందుకు వాహనాలు సమకూర్చడం జరిగిందని రాష్ట్ర వైద్యానికి శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులకు కొత్త వాహనాలు అందజేశారు. సంఘటన జరిగిన వెంటనే సకాలంలో చేరుకునేందుకు వాహనాలు సమకూర్చడం జరిగింది అన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో కొత్తగా కలెక్టర్ నివాస భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్ తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.