calender_icon.png 21 March, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది

20-03-2025 06:35:24 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకొని పాఠశాలలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో పాటు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు తెలిపారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నూతన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వంట సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులను వినియోగించాలని తెలిపారు. వంటశాల, మూత్రశాలలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమయానుసారం పిల్లల ఎత్తు, బరువు పరీక్షించాలని, పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం 30 పకడల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.